అపరిశుభ్రంగా ఉన్న ఎస్బిఐ ఏటీఎం కేంద్ర కెవిపిఎస్, డివైఎఫ్ఐ,జిల్లా నాయకులు

Published: Monday July 18, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై17(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని రాజంపేటలో ఉన్న ఎస్బి ఐ ఏటీఎం కేంద్రం అపరిశుభ్రంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివారం కెవిపిఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిశెల కార్తీక్ లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు  ఎంతో మంది నగదు వితడ్రా చేసుకోవడానికి ఏటీఎం కేంద్రానికి వస్తుంటారని అన్నారు. ఎస్బిఐ కేంద్రానికి రావడానికి వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంక్ అధికారులపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే వినియోగదారులు ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా  సంబంధిత అధికారులు స్పందించి ఏటీఎం కేంద్రం వద్ద పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 
 
Attachments area