*ప్రభుత్వ జి ఒ ప్రకారం వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.*
Published: Wednesday December 28, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 27, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వర్కర్లకు కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా , జి ఒ నంబరు. 60 ని అమలు చేయకుండా ఇష్టరితిన వేతనాలు చెల్లిస్తూ, పి ఎఫ్, ఇఎస్ఐ పూర్తిగా చెల్లించడం లేదని, యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వడం లేదని నిరసన తెలుపుతూ మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వినతిపత్రం అందించిన దుంపల రంజిత్ కుమార్ సి ఐ టి యు జిల్లా కార్యదర్శి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్కర్లు అందరికీ చేయించాలని కోరుకుంటూ, వెంటనే పలు సమస్యలు పరిష్కరించి వర్కర్లకు న్యాయం చేయాలని లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాకేష్,ఫయాజ్,స్వరూప,రజిత తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: