శాంతిఖని గని మేనేజర్ కు సన్మానం

Published: Tuesday April 27, 2021

బెల్లంపల్లి మార్చి 26 ప్రజా పాలన ప్రతినిధి: ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని, సంస్థ అభివృద్ధి కోసం సింగరేణియుల మందరము కష్టపడి పని చేస్తూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని  శాంతిఖని గని మేనేజర్ గుండేటి శంకర్ అన్నారు. కొత్తగా వచ్చిన మేనేజర్ గుండేటి శంకర్ బాధ్యతలు స్వీకరించిన  సందర్భంగా సోమవారం నాడు శాంతి ఖని గని ఆవరణంలోని మేనేజర్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన సి ఎస్ టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమం లో ఆయన మాట్లాడు తూ రక్షణ సూత్రాలు విధిగా పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా తమ తమ విధులు నిర్వహించాలని అప్పుడే సంస్థ అభివృద్ధి తో పాటు కార్మికులుకూడా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అండర్ మేనేజర్ నాగవర్ధన్, అధ్యక్షుడు ఆరేపల్లి రాములు, ఉపాధ్యక్షుడు మైనింగ్ సర్దార్ కె, నాగయ్య, మెకానికల్ ఫోర్ మెన్ డి, అశోక్, పిట్టర్ రవి నాయక్,పిట్ ఇంజనీర్ రాంబాబు, ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ రమేష్, చిలుక రాజనర్సు, కార్యదర్శి రాజనాల రమేష్, ఏం, భాస్కర్, తదితర నాయకులు పాల్గొన్నారు.