భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నూతన కమిటీ ఎన్నిక

Published: Thursday September 09, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 7, ప్రజాపాలన ప్రతినిధి : మహా గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజించి, గణేశుని కృప కాలనీవాసులకు అనుగ్రహం కలిగించినట్లు కమిటీ భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు, ఉపాధ్యక్షులు శశిధర్ రావు, నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ కీసర గోవర్ధన్ రెడ్డి గార్ల సమక్షంలో భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ నూతనంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు కోడేరు సోమేశ్వర్, ఉపాధ్యక్షులుగా పసునూరి బిక్షపతి చారి, ప్రధాన కార్యదర్శిగా ముత్తంగి కరుణానిధి, కోశాధికారిగా చప్పిడి జంగారెడ్డి, కార్యదర్శలగా ఏ బీమ్ రాజ్, పల్లె జంగయ్య గౌడ్, జటావత్ రవి నాయక్, కీసర హరినాథ్ రెడ్డి, కమిటీ సభ్యులు జగన్ ముదిరాజ్, డి సురేష్, గోపి యాదవ్, ఎం. సుధాకర్, పి.వేణుగోపాల్ రెడ్డి, జి శ్యామ్ కుమార్, కే.శ్యాంసుందర్, గుర్రం మల్లారెడ్డి, శూర కర్ణ రెడ్డి, లతో భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ... గణేష్ మండపం నిర్వాహకులకు ఏలాంటి ఇబ్బందులు ఉన్న భక్తులు గణేష్ ఉత్సవ కమిటీ కి తెలుపగలరని కోరారు.