17వ డివిజన్లో మేయర్ డిప్యూటీ మేయర్ ఆకస్మిక పర్యటన

Published: Wednesday June 16, 2021
మేడిపల్లి, జూన్15 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీల్లో నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ప్రజా సమస్యలపై ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్  డిఈ. శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, బండి సతీష్ గౌడ్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.