పార్టీ బలోపేతానికి కృషిచేయండి

Published: Tuesday September 13, 2022
జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి
*- కేఎస్ రత్నం, నాగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సునితమ్మను కలిసిన నాయకులు
*నవాబ్ పేట వైస్ ఎంపీపీ, గొల్లగూడా సర్పంచ్
వికారాబాద్ బ్యూరో 12 సెప్టెంబర్ ప్రజా పాలన : వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, టీఎస్ ఈడబ్ల్యుఐడీసి మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బందెయ్య గౌడ్, గొల్లగూడ సర్పంచ్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు యాసీన్ సునితమ్మను కలిశారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ పార్టీ, తాము ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీరు కూడా పార్టీ బలోపేతానికి మండలంలో కృషిచేయాలని సూచించారు.