మధిర బంజారా కాలనీలోని పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ:: మధిర పట్టణ కాంగ్రెస్

Published: Thursday March 18, 2021

మధిర, మార్చి17, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ లోని 19 వ డివిజన్ బంజారా కాలనీలో బేకరీ పని చేసుకుంటూ నివసిస్తున్న జంగయ్య అనే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదం గురై ఇబ్బంది పడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు వెంకట వెంకట రమణ నాయక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్ కు తెలియజేయగా వారు వెంటనే స్పందించి ఏర్పాటు చేయగా ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్యా, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల లాలయ్య, ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు షేక్ బాజీ, డివిజన్ అధ్యక్షులు అంబర్ పేట రామారావు, ఆదిమూలం శ్రీనివాసరావు, తలుపుల వెంకటేశ్వర్లు, ఆదిమూలం శ్రీనివాస్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోట డేవిడ్, గద్దల విజయ్, కోట నాగరాజు, డివిజన్ అధ్యక్షులు మాగం ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రహీమ్, దోర్నాల సునీల్ బి. రాజేందర్, తదితరులు పాల్గొన్నారు