అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాట

Published: Wednesday June 08, 2022

రాయికల్, జూన్ 07 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాటలో భాగంగా రాయికల్ పట్టణ కేంద్రంలో అంగన్వాడీ ఆధ్వర్యాన బడిబాట ర్యాలీ అంగన్వాడి కేంద్రాల నుంచి స్థానిక పాత బస్టాండ్ అంగడి బజార్ వరకు నిర్వహించారు. ర్యాలీలో రాయికల్ మున్సిపల్ కమిషనర్ జి.సంతోష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు ఇంటింటికి తిరిగి చిన్నారులను గుర్తించి వారి పేర్లు నమోదు చేసుకుని అంగన్వాడీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య నేర్పిస్తూ మంచి పోషకాహారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.