రోడ్డు కష్టాలు తీర్చిన నాయకులకు పాలాభిషేకం చేసిన గ్రామస్తులు.

Published: Tuesday November 15, 2022

అశ్వాపురం ( ప్రజా పాలన.)
అశ్వాపురం మండలంలోని ఎలకలగూడెం టు మనుబోతులగూడెం  బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు మనుబోతుల గూడెం గ్రామస్తులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  కేసీఆర్  చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఆ గ్రామ పెద్ద ఏనుక శివాజీ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు అలాంటి మారుమూల ప్రాంతానికి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే &ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  రోడ్డు మంజూరు చేయించినందుకు గ్రామస్తుల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు ఈ కార్యక్రమంలో మనుబోతుల గూడెం సర్పంచ్ స్వరూప గ్రామస్థులు పాల్గొన్నారు