ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసీన ప్రజాసంఘాలు

Published: Wednesday May 04, 2022
బోనకల్, మే 3 ప్రజాపాలన ప్రతినిధి: కమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనతో నెల రోజులు ఉపవాస దీక్షలు చేసి రంజాన్ పర్వదినాని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు రావినూతల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కై, లౌకిక ప్రజాస్వామ్యం కాపాడుకొనుటకు ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు. పంతులు, రైతు సంఘం నాయకులు గండు సైదులు, కొంగర.గోపి, జోనిబోయిన గురవయ్య, ఎర్రగాని నాగరాజు, ఆవాజ్ నాయకులు, షేక్ నన్నేసాహెబ్, షేక్ నాగుల్ మీరా, మజీద్, పఠాన్ అబ్జల్, టీఎస్ యుటియఫ్ మండలప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ 1వ వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు, భానోత్ నాగేశ్వరరావు, కొమ్మినేని పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.