కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కులను అందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Thursday October 28, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 40 మందికి బుధవారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కులను అందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలు ముస్లిం మైనార్టీ లకు చెందిన ప్రజలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఎంతో కొంత మేలు చేయడానికి ప్రవేశపెట్టిన పథకం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అని ఆయన అన్నారు. బుధవారం నాడు నియోజకవర్గంలోని 40 మంది లబ్ధిదారులకు 40 లక్షల నాలుగువేల 600 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ టి, సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్ , మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు, బెల్లంపల్లి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.