పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ
Published: Friday May 28, 2021
మేడిపల్లి, మే27 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా వల్లన ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆదేశాల మేరకు ఉప్పల్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ డివిజన్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్, రావుల బాలక్రిష్ణ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు గోరిగే వెంకటేష్ కురుమ, తీగ విట్ఠల్ రావు,వర్కల రాజేందర్ గౌడ్, సింగారం కార్తీక్, ఈదులకంటి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: