డ్రైనేజీ పనులను ప్రారంభించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి

Published: Tuesday November 29, 2022
మేడిపల్లి, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి)

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్

 8,9వ డివిజన్ల పరిధిలోని ద్వారకా నగర్ పేస్ 2 లో రూ 15 లక్షలతో  డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్లు
 సీసా వెంకటేష్ గౌడ్, మోదుగు లావణ్య శేఖర్ రెడ్డిలతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు మోదుగు శేఖర్ రెడ్డి, మోదుగు మోహన్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.