నర్సరీ పార్క్, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన మండల పంచాయతీ అధికారి
Published: Friday February 11, 2022
బోనకల్, ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గురువారం గోవిందాపురం ఏ గ్రామంలో బోనకల్ మండల పంచాయితీ అధికారి గ్రామంలో ఉన్న నర్సరీ పార్క్ మరియు రోడ్డు లు, పల్లె ప్రగతి వనం ఇన్ఫెక్షన్ కు వచ్చి పరిశీలన చేయడం జరిగింది. అనంతరం గ్రామ సర్పంచ్ బాగం శ్రీను వాసరావు నర్సరీ పార్క్ మరియు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు గురించి మండల పంచాయితీ అధికారికి సర్పంచ్ బాగం శ్రీను వాసరావు గ్రామాన్ని చుపించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ అలి, గ్రామ పంచాయితీ కార్యదర్శి హిమబిందు, మరియు గ్రామ పంచాయతీ వర్కర్స్ దార సురేష్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: