జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానంద్ రావు గారి అధ్యక్షతన బర్మా క్యాంపు లో స్

Published: Monday May 31, 2021
సింగరేణి కార్మిక వాడల్లో స్వర్గీయ కాశయ్య  గారి విగ్రహాలు ప్రతిష్టించాలి !
జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానంద రావు 
భద్రాద్రి, కొత్తగూడం జిల్లా, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : స్వర్గీయ కాశయ్య నిరాడంబరత నిజాయితీ నిబద్ధత కలిగిన ఉత్తమ విలువలను పాటించిన అటువంటి గొప్ప నాయకుడని సింగరేణి కార్మిక ప్రాంతంలో కంపల్సరీ డిపాజిట్ స్కీం CDS సమ్మె చారిత్రాత్మకమైన దని   ఆ యొక్క సమ్మెలో అన్ని కార్మిక సంఘాలను ఒకతాటిపై తీసుకు వచ్చిన ఘనత స్వర్గీయ చేకూరి కాశయ్య  గారికి దక్కిందని వారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ జడ్పీ చైర్మన్ గా ఉన్న పరిపాలన లోను సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడినా రని స్వర్గీయ కాశయ్య గారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానంద్ రావు పిలుపునిచ్చారు 30 05 2021 నాడు  స్థానిక బర్మా క్యాంపు లో ఉదయం 10 గంటలకు చమన్ బస్తీ సత్యానంద నగర్ బర్మా క్యాంప్ ఎం కె సుబ్బయ్య నగర్ బస్తీవాసులు కలిసి స్వర్గీయ కాశయ్య గారి సంతాప సభ నిర్వహించారు ఈ సంతాప సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన అభ్యుదయ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మరియు కవి సినీ గీత రచయిత గాయకుడు సమాజ సేవకుడు మద్దెల శివ కుమార్ మాట్లాడుతూ అంకితభావం కృషి దీక్ష దక్షతలు రాజనీతిజ్ఞత నీతి నిజాయితీ నిబద్ధత కలుపుగోలుతనం నిరాడంబరత ఉత్తమ అధ్యాపకుడిగా గొప్ప వక్తగా కవిగా ఉత్తమ విలువలు కలిగిన సేవా జీవితాన్ని మనకు అందించిన స్వర్గీయ కాశయ్య ధన్యజీవి అని మనకు అందరికి మార్గదర్శకులు అని అభినందించారు తొలుత స్వర్గీయ కాశయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సంతాప సభ లో శ్రీ గొల్లపల్లి మరియు మద్దెల తోపాటు రిటైర్డ్ కార్మిక సంఘం కార్యదర్శి చింతా దుర్గారావు ఎన్ కేవీ సుబ్బయ్య నగర్ బర్మా క్యాంప్ అధ్యక్షులు కే గురుమూర్తి నాని బాబు పి హరి ఎస్ వి ప్రసాద్ గొల్లపల్లి అశోక్ జి సత్య హరి నంద్ ఎస్కే హుస్సేన్ సంకినేని చిరంజీవి జి ఎస్ రెడ్డి మరియు బస్తీవాసులు  పాల్గొన్నారు నాగరాజు వందన సమర్పణతో సభ ముగిసింది