ఆయుధం కంటే అహింసా మార్గము గొప్పది

Published: Monday October 03, 2022
విపివిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్
వికారాబాద్ బ్యూరో 2 అక్టోబర్ ప్రజాపాలన : ఆయుధం కంటే అహింస మార్గమే గొప్పదని రుజువు చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని వికారాబాద్ జిల్లా పబ్లిక్ వాయిస్ ఫోరం అధ్యక్షుడు అశోక్ అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అధ్యక్ష ఉపాధ్యక్షులు అశోక్ వేణు ప్రధాన కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పబ్లిక్ వాయిస్ ఫోరం అధ్యక్షులు పి అశోక్ మాట్లాడుతూ  దేశ స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలకపాత్ర పోషించారని తెలిపారు. అహింస మార్గాన్ని ఎంచుకొని బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టి దేశ ప్రజలకు విముక్తి కలిగించారు అని అన్నారు. మహాత్మా గాంధీ యొక్క అహింస మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు  కులాలను మతాలను రెచ్చగొట్టకుండా శాంతియుత మార్గంలో ప్రభుత్వాలను నడపాలన్నారు. పబ్లిక్ వాయిస్ ఫోరం కూడా అహింస మార్గంలో వికారాబాద్ జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ వాయిస్ జిల్లా ఉపాధ్యక్షులు వేణు, పబ్లిక్ వాయిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి జె రాములు, ఫోరం సభ్యులు రాజు, సి ప్రవీణ్, హరేందర్ , రాములు , మహేందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.