శ్రీరాములోరిని దర్శించుకున్న శ్రీనివాసరెడ్డి దంపతులు..*

Published: Wednesday January 11, 2023
తల్లాడ, జనవరి 10 (ప్రజా పాలన న్యూస్): 
 *రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రస్వామిని తల్లాడ బీఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్, విడిసీ చైర్మన్ దగ్గుల శ్రీనివాస రెడ్డి, లలిత కుమారి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములొరికి వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం  శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడిపంటలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సీతారెడ్డి, విజయ, అభినవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.*