తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి మండలంలో

Published: Monday April 03, 2023

ప్రాథమిక తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమం శనివారం రోజు ముగిసింది సందర్భంగా ఆయన అక్కంపల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పల్లెలను పట్టణాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అభివృద్ధి వేగవంతం చేస్తున్నానని, పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయని, రైతులు ప్రజలు సుఖశాంకలతో ఉండాలని సుఖంగా ఉండాలని శాంతితో ఉండాలని ,ఆనందంతో ఉండాలని రైతుబంధు కళ్యాణ్ లక్ష్మి అనేక కార్యక్రమాలను కెసిఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. పల్లె ప్రాంతాలలో అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి బాలేశ్వర్ గుప్తా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ సర్పంచులు కార్యకర్తలు నాయకులు  తదితరులు పాల్గొన్నారు.