ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *గడపగడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న మ

Published: Saturday February 11, 2023
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రగతి నివేదన పాదయాత్ర చేస్తున్న మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి కు  ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మేడిపల్లి సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప శ్రీనివాస్ అన్నారు. ఆనంతరం శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేటితో ప్రగతి నివేదన పాదయాత్ర  19 రోజుల 39గ్రామాలు నుండి పాదయాత్ర 270 కిలోమీటర్లు పూర్తి చేశారు.ప్రభుత్వ పథకలను ప్రచారం మే ధ్యేయంగా పాదయాత్ర ముందుకు సాగుతుందన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తో పాటు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో ప్రజలకు కావలసిన అవసరాలని అడిగి తెలుసుకుంటున్నారు. మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు పార్టీలకతీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వడివడిగా ముందుకు సాగుతున్నారు ఆయనకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. మహిళలు యువకులు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ చేసిన ప్రాదయాత్రకు అందరూ సహకరించాలని మేడిపల్లి సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప శ్రీనివాస్ కోరారు.