. *వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం పొందిన శ్రీనిధి విద్యార్థిని
Published: Thursday September 08, 2022
మధిర రూరల్ సెప్టెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి జీవిత బీమా సంస్థ మధిర బ్రాంచ్ వారు 66 వ జీవిత బీమా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో మధిర
శ్రీనిధి స్కూల్ విద్యార్థిని శరణ్య మొదటి బహుమతి సాధించింది. ఈ బహుమతులను మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ చేతులు మీదుగా అందు కున్నారు. వ్యాస రచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినిని శ్రీనిధి స్కూల్ ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు, సెక్రెటరీ మరియు కరస్పాండెంట్ బి. అంజన బాబు డైరెక్టర్ చందు వెంకటనారాయణ లు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు
అభినందించినారు.
Share this on your social network: