ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday October 01, 2022

*ఖానాపూర్ రైతులకు అండగా  వైఎస్సార్ టిపి
పేదలకు భూములు దక్కే వరకు పోరాటం చేస్తా*

*వైఎస్సార్ టిపి ఇబ్రహీంపట్నం నియెజకవర్గం ఇంఛార్జీ ఇటుకల సుగుణ రెడ్డి*

పేదలకు భూములు దక్కే వరకు పోరాటం చేస్తామని ఖానాపూర్ రైతులకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ టిపి ఇబ్రహీంపట్నం నియెజకవర్గ ఇంఛార్జీ ఇటుకల సుగుణ రెడ్డి అన్నారు. శనివారం ఖానాపూర్ గ్రామంలోని నిరుపేద 60 మంది రైతులను  కలిశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  దేవేందర్ కాలనీలో గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న నిరుపేద 60 మంది రైతుల పోరాటం కోసం తమకు మనో ధైర్యాన్ని ఇచ్చారు గత ప్రభుత్వం తమకు ఉచితంగా పట్టాలిచ్చామని గుర్తు చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం అది లాక్కోవాలని చేయడం దారుణం అన్నారు టిఆర్ఎస్ పార్టీ అండతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేదల భూములను కబ్జా చేయడం దారుణమని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో  వైఎస్సార్ టీపి నాయకులు సామల జస్వంత్ రెడ్డి ,రాష్ట్ర విద్యార్థి విభాగం పాండల వినోద్ గౌడ్ రమేష్ ముదిరాజ్ మహ్మద్ ముస్తఫా కొండ్రు తరుణ్ రాజు  విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ భూ నిర్వాసితులు రైతులు తదితరులు పాల్గొన్నారు.