కోవిడ్ తో మరణించిన దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి.

Published: Tuesday May 18, 2021
కోరుట్ల, మే 17 (ప్రజాపాలన ప్రతినిధి):తెలంగాణలోని దళితుల కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం కింద 25,000/- రూపాయలు ఇచ్చి అట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షుడు దామ రాజేష్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ మూలంగా ఉపాధి కోల్పోయిన దళితులు ఆర్థికంగా చితికి పోయి అరకొర వసతులతో జీవితం నెట్టుకొస్తున్నారు అలాగే కోవిడ్ కారణంగా కుటుంబంలో మరణం సంభవిస్తే అట్టి కుటుంబం రోడ్డున పడి విలపిస్తున్నారని కావున తక్షణ ఆర్థిక సహాయం కింద దళితులకు 25000/-రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తరుపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జీవన్, పవన్, రాజ్ కుమార్, శ్రావణ్, నాగరాజ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు