60 లక్షల నోట్లతో అలంకరించిన ధనలక్ష్మి దుర్గా మాత అలంకరణ.
Published: Tuesday October 12, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 11 ప్రజాపాలన ప్రతినిధి : దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణం లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం లో 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ధనలక్ష్మి అవతారాన్ని 60 లక్షల రూపాయలతో అత్యంత సుందరంగా అలంకరించారని స్థానిక ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోనే అత్యంత అద్భుతంగా అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు దాండియా నృత్యాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Share this on your social network: