అఖిలపక్ష మహాధర్నాలో రేవంత్ రెడ్డికి శాలువా కప్పి స్వాగతం తెలిపిన కొత్త కిషోర్ గౌడ్

Published: Thursday September 23, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష పార్టీల అధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన మహాధర్నాకు విచ్చేసిన  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి శాలువా కప్పి స్వాగతం తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన మహాధర్నాకు కొత్త కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో బోడుప్పల్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకట్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు ఆసర్ల బీరప్ప కురుమ, రాపోలు ఉపేందర్, మాకు శివకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.