సేవకై జీవించు - సేవకై తపించు

Published: Friday February 19, 2021
మధిర, ఫిబ్రవరి 18, ప్రజా పాలన: వాసవి ట్రస్ట్ (బెంగుళూరు) ఖమ్మం, వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం - గాంధీ చౌక్, ఖమ్మం, నందు కుట్టుమిషన్లు, గ్రైండర్లు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమము. ఈరోజు వాసవి ట్రస్ట్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో, జిల్లా లో వివిధ పట్టణాలు కు చెందిన లబ్ధిదారులకు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయము, పదవ వార్షికోత్సవం సందర్భంగా  "వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, గ్రైండర్లులు, పంపిణీ కార్యక్రమం నిమిత్తము "మధిర సేవా సమితి ఆధ్వర్యంలో" సెలెక్ట్ అయిన లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమము గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి  శ్రీ పువ్వాడ అజయ్ గారు, ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ గార్ల చే ఖమ్మం పట్టణంలోని లబ్ధిదారులకు అందజేసినారు. మధిర సేవా సమితి వారు మధిర లబ్ధిదారులకు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో మధిర పట్టణమునందు ఇక్కడకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు తెప్పించి, అమౌంట్ చెల్లించిన సెలెక్ట్ అయిన పేదల లబ్ధిదారులకు త్వరలో పంపిణీ కార్యక్రమం చేపడతామని మదిర సేవా సమితి అధ్యక్షులు  పల్లపోతు ప్రసాద్ రావు గారు ఈ సందర్భంగా తెలిపారు. మధిర ప్రాంతంలో సెలెక్ట్ అయిన లబ్ధిదారులు కు ఈ కార్యక్రమంలో అతిధులు మంత్రి పువ్వాడ అజయ్ గారు సినీ నటుడు శ్రీకాంత్ గారి చేతుల మీదుగా మధిర దరఖాస్తు చేసిన అందరి లబ్ధిదారులకు అలాట్మెంట్ చేసినారు. వీరిలో పర్శ బోయిన లక్ష్మి, కోమటి లత, ముక్కర శ్రీలత, తల్లం శైలజ, సిద్ధం శెట్టి ఉమాదేవి మరీదు కృష్ణవేణి లక్ష్మి ప్రభావతి నాగ సులోచన,  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లో శిరిడి సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులు వేములపల్లి వెంకన్న గారు, మరియు కమిటీ సభ్యులు, ఖమ్మం వాసవి ట్రస్ట్ బృందం, సినీ నటుడు శివాజీ రాజా పాల్గొన్నారు మదిర సేవ సమితి ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు, కోశాధికారి యర్రా లక్ష్మణ్, గౌరవ సభ్యులు కోమటి సుధాకర్ పాల్గొన్నారు.