ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం.....

Published: Friday February 04, 2022
ఎర్రుపాలెం ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ తెచ్చుకొని ముఖ్యమంత్రిగా పదవి అనుభవిస్తూ అదే రాజ్యాంగాన్ని మార్చాలని కెసిఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాదిగ, మండల అధ్యక్షులు మేకల రమేష్ మాదిగ, సునీల్ మాదిగ, శ్యామ్ సుందర్ మాదిగ, దేవరకొండ వెంకటేశ్వరరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.