టిఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి

Published: Wednesday March 03, 2021

వికారాబాద్ జిల్లా మార్చ్ 02 ( ప్రజాపాలన ప్రతినిధి ) : టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సురభి వాణి దేవికే ఓటు వేయాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తమ వంతు సహకారాన్ని అందజేయాలని కోరారు. గతంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా గ్రూపు 1, 2 కోచింగ్, భోజన వసతి, స్టడీమెటీరియల్ అందజేసి ఉద్యోగ నైపుణ్య మెలకువలను శిక్షణ ఇప్పించారు. ఎందరో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఆశాజీవిగా మారింది.