గంగపుత్ర యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

Published: Wednesday July 28, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 27( ప్రజాపాలనా ప్రతినిధి): మండలంలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల ఖాళీ స్థలంలో హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చెట్లు పెట్టినారు. వాటిని సంరక్షణ బాధ్యతగా వాటికి చుట్టూ గ్రామ సర్పంచ్ శ్యామల తుకారం కంచె నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ కార్యక్రమంలో కంచె చుట్టూ జాలి కట్టడం గంగపుత్ర యూత్ సభ్యులు తమ వంతు సేవా కార్యక్రమం చేసినారు. కార్యక్రమంలో సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం. మరియు ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, శేఖర్, నందయ్య, పారిపెల్లి గణేష్, రమేష్, అశోక్, భూపాల్, శంకర్, శ్రీధర్, లక్ష్మణ్,  మరియు గంగపుత్ర యూత్ సభ్యులు పాల్గొన్నారు.