బెల్లంపల్లి టి సి ఓ ఎ క్లబ్ లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

Published: Monday April 04, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: "శుభకృతు" నామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర పండుగను బెల్లంపల్లి పట్టణంలోని టిసిఓఏ క్లబ్లో నిర్వాహకులు శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా, శాంతిఖని గని ప్రాజెక్టు అధికారి కె.వెంకటేశ్వర్లు, తాండూరు సీఐ, కే, జగదీష్, క్లబ్ సెక్రెటరీ రాపోలు సుధీర్, తదితరులు హాజరయ్యారు. ఈ ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని చిన్నారులకు, మహిళలకు మరియు క్లబ్ సభ్యులకు, ఆటల పోటీలు నిర్వహించి, గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అలాగే రాష్ట్రస్థాయిలో  జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ లో పతకాలు సాధించిన వారిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ మేనేజర్ సిహెచ్, రమేష్, స్పోర్ట్స్ సూపర్ వైజర్ హెచ్ రమేష్ మరియు శ్రీనివాస రాజు తదితరులు, పాల్గొన్నారు.