సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే

Published: Tuesday July 20, 2021
ఇబ్రహీంపట్నం, జులై 19, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోమంచాల మండలానికి చెందిన లబ్దిదారులకు 2లక్షల 4వేల రూపాయలు CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి  మంచాల మండలం తాళ్లపల్లిగూడ గ్రామానికి చెందిన K.మల్లయ్య 60,000 రూపాయలు, D.అర్జున్ 48,000 రూపాయలు, P.పెంటారెడ్డి 46,000 రూపాయలు, A.దీక్షిత 14,000 రూపాయలు మరియు చిత్తాపూర్ గ్రామానికి చెందిన P.తిర్మలేష్  36,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 2,04,000 రూపాయల విలువ చేసిన CMRF చెక్కులను ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి క్యాంపుకార్యాలయంలో ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ నర్మదలచ్చిరం, తెరాస మండల  అధ్యక్షులు చీరాల రమేష్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, MPTC సుఖన్య శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు రాజేష్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.