కోటిలింగాల లో ప్రత్యేక పూజలు

Published: Friday December 24, 2021

ఎల్.ఎం చారి టేబుల్ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత.

వెల్గటూర్, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్ ఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత గురువారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం దగ్గర టిఫిన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి కోటిలింగాల కు వచ్చే భక్తులకు సాంప్రదాయ టిఫిన్స్ అందించాలని అదేవిధంగా రుచికరముగా పరిశుభ్రంగా ఉండేవిధంగా టిఫిన్ సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోటిలింగాల దేవస్థానం చైర్మన్ పదిరె నారాయణరావు, తె.రా.స మండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్, ఉపాధ్యక్షులు డాక్టర్ జగదీష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల సురేష్, తె.రా.స మండల శాఖమాజీ అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్, ప్రముఖ వైద్యులు బి.రామస్వామి, నక్క రవితేజ, అర్చకులు సంజీవ్, అవినాష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు