సభ్యత్వాలూ నమోదుచేసిన ఎన్రోలర్ల ను ఘనంగా సత్కరించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి

Published: Wednesday February 09, 2022
మధిర ఫిబ్రవరి 8 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ అధ్యక్షతన సభ్యత్వ నమోదు ఎన్రోలర్ ల సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధిర మండలం సభ్యత్వ నమోదు ఇన్చార్జి పెండ్ర అంజయ్య  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మధిర మండలంలో అనుకున్న దానికంటే కూడా సభ్యత్వాలు వేగంగా నమోదవుతున్నాయని ఇలాగే ఇంకా నమోదు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మధిర మండలంలో ఐదు వందల సభ్యత్వాలు నమోదు చేసిన పగిడిపల్లి డేవిడ్ జాకీర్ హుస్సేన్ అదురీ శీను పులి బండ్ల చిట్టిబాబు లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు ఈ కాంగ్రెస్ నాయకులు సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ప్రజలతో సంబంధాలు ఉన్నా పార్టీ అని అందుకే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీలో ప్రజలు అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున నిరుద్యోగ లు అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు చేశారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణ, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు బిసి సెల్ మండల అధ్యక్షులు  చిలువేరు బుచ్చి రామయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్  కిసాన్ సెల్ మండలాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కె ఫయాజ్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు intuc మండల అధ్యక్షుడు కోరంపల్లి చంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మువ్వ వెంకయ్య బాబు సర్పంచ్ ఎస్.కె మదర్  సొసైటీ డైరెక్టర్లు వనమా పిచ్చయ్య కనక పూడి కరుణాకర్, సంపాశాల రామకృష్ణ, రావిలాల సత్యనారాయణ కృష్ణారావు బుర్ర శీను, సూర్యదేవర హనుమంత్ రావు, యడ్ల సాంబయ్య ఎడ్లపల్లి వెంకటకృష్ణ భూక్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు