దశాబ్దాల కళ నెరవేరింది పట్టణ జోన్ల మర్పిడిపై కృతజ్ఞత సభలో ఎమ్మెల్యేకు సన్మానం...

Published: Friday June 25, 2021
జగిత్యాల, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణ ప్రజల నాలుగు దశాబ్దాల కళ జోన్ల మార్పిడి మాస్టర్ ప్లాన్ అమలుతో జగిత్యాల పట్టణ ప్రజల కోరిక నెరవేరిందని వికేబీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణంలో గాని రోడ్ల అంశంలో కానీ పట్టణ ప్రాంత వాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగే విదంగా పర్మిషన్లు ఇచ్చి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్ స్థానిక కౌన్సిలర్ వల్లెపు రేణుక మోగిలి అడువాల జ్యోతి పిట్టా ధర్మరాజు రాజుకుమార్ కూతురు రాజేష్ చుక్క నవీన్ గుగ్గిళ్ల హరీష్ కౌన్సిల్ సభ్యులు తెరాస నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.