డిపిఆర్ సబార్టినేటర్ తలారి శ్రీశైలం మృతి

Published: Tuesday November 29, 2022
శ్రద్ధాంజలి ఘటించిన అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 28 నవంబర్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆఫీస్ సబార్డినేట్ తలారి శ్రీశైలం గుండె నొప్పితో సోమవారం ఉదయం మరణించడం జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన శ్రీశైలం చిత్రపటం వద్ద అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పూలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. శ్రీశైలం కుటుంబ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో సహాయ పౌర సంబంధాల అధికారి ప్రభాకర్ ,  డిపిఆర్ఓ సిబ్బంది జ్ఞానేశ్వర్,  శ్రీనివాస్ , సతీష్ , హనుమంత్, వ్యవసాయ శాఖ ఏడిఏ రమాదేవి వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు