జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్
Published: Saturday January 28, 2023
మేడిపల్లి, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి)
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్15వ డివిజన్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్లోని
విహారీక కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రమణారెడ్డి ,వెంకటరెడ్డి , సుధాకర్,మదన్మోహన్ రెడ్డి , రమేష్ చారీ, సురేందర్ రెడ్డి,జితేందర్ రావు ,కళ్యాణ్ రెడ్డి ,వెంకటేష్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సత్తిరెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: