రైతులను ఆదుకోవాలని తహశీల్దార్ కు వినతి..

Published: Tuesday October 11, 2022
తల్లాడ, అక్టోబర్ 10 (ప్రజాపాలన న్యూస్): నకిలీ మిరప నారు వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సోమవారం బిజెపి ఆధ్వర్యంలో తల్లాడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా  నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు ఆపతి రామారావు మాట్లాడుతూ మిర్చి సాగు చేసిన రైతులు లక్షల్లో ఖర్చు పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి నారు పూత రాకపోవడంతో నష్టపోయారన్నారు. తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరంరాజు, కృష్ణారావు, నాగేశ్వరావు,  తదితరులు ఉన్నారు.