డ్రగ్స్ నివారణ గురించి అవగాహన సమావేశం
Published: Friday February 25, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరెణి చేతన హరిష్ ఆధ్వర్యంలో డివిజన్లోని వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులతో మధురానగర్ కమ్యూనిటీ హల్లో శాంతిభద్రతలు మరియు డ్రగ్స్ నివారణ గురించి అవగాహనన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ పోలీసు స్టేషన్ సీఐ గోవింద్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ గోవింద్ రెడ్డి డ్రగ్స్ నివారణ గురించి పలు సలహాలు, సూచనలుు ఇచ్చారు. కాలనీలో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నటైతే వెంటనే సమచారం ఇవ్వాలని సీఐ కాలనీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలకు సూచించారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డి అనంద్ రెడ్డి, కుంభం సాగర్ రెడ్డి, గడ్డం సాయికిరణ్, సుంకోజు శ్రీనివాస్ చారి, చంద్రమౌళి, గాదె సత్యనారాయణ, తుమ్మలి రవి, పెంటవల్లి వెంకన్న, రాగి వెంకట్ రెడ్డి నారాయణ దాస్, పూల కృష్ణ, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శిలు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, సంజయ్ పటేల్, వేములకొండ వెంకన్న, పూజారి సోమయ్య గౌడ్, అల్కాపురి సురేష్ ముశిగంపల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: