ఆశ కొండయ్య కు అభినందనలు

Published: Friday February 26, 2021
మధిర ఫిబ్రవరి 25 ప్రజా పాలన ప్రతినిధి: ఈ రోజు కృష్ణాపురం జిల్లా మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నందు జరిగిన షేర్ ngo రోడ్డు సేఫ్టీ అవగాహనా సదస్సు నందు విద్యార్థులకు వ్యక్తిత్వవికాశంతో పాటు పలు దురలవాట్లు మానాలి అనే విషయాలు సంపూర్ణoగా వివరించి నందుకు మరియు Hiv/ఎయిడ్స్. టీబీ. కరోనా వ్యాదుల గురించి అవగాహనా పరుస్తున్నoదుకు సమాజహితం కోసం కృషి చేస్తున్నoదుకు (DMWO) జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి రమేష్ గారు మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ Sk సమీమ్ షేర్ ngo సీఈఓ గాదె గోపాలరెడ్డిచేతులు మీద గా ఘనంగా అభినందించారు. ఈ సందర్బంగా DMWO రమేష్ గారు మాట్లాడుతూవ్యాది రహిత సమాజం కోసం మరియు అనేక సామాజిక సేవలు అందించటం కోసం కొండయ్య లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో జి.గోపాలరెడ్డి వాలంటీర్లు వెంకటకృష్ణ గారపాటి శ్రీనివాస్, గోపి మోహనరెడ్డి మైనార్టీ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.