అనునిత్యం ప్రజల కోసం, ప్రజల కొరకు కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన పొందుతున్న బూర్గంపా

Published: Wednesday November 02, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో 7వ రోజు అనునిత్యం ప్రజలకు కొరకు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బిఆర్ఎస్  పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని ఒడియా క్యాంప్, సాయిబాబా గుడి, ఏరియాలలో... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ,విస్తృతంగా పర్యటించారు ఉదయం 6 గంటల నుంచి కాలనీలలో పర్యటించి సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు త్రాగునీరు డ్రైనేజీ రహదారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు ప్రజలు జెడ్పిటిసి  దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ సమస్యలను  త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులను  కోరారు.
 పినపాక నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారని నియోజవర్గంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను  శ్రీ రేగా కాంతారావు  కృషితో  కోట్లాది రూపాయల నిధులు మంజూరు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారని  , అనేక గ్రామాలకు సిసి రోడ్లు ,బీటి రోడ్ల నిర్మాణం, కల్వర్టులు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు., ప్రజల దగ్గరికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించి వారి  నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే  ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని  ఆమె అన్నారు, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, ప్రభుత్వం అందిస్తుందని అన్నారు .రైతుబంధు ,రైతు బీమా, లాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని  వారు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ గారు, బిఆర్ఎస్  పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, బిఆర్ స్ పార్టీ  సినియర్ నాయకులు బెల్లంకొండ రామరావు ,  ప్రధాన కార్యదర్శి భూక్య చిరంజీవి, సట్టు అంజనేయులు బిఆర్ స్ పార్టీ నాయకులు బెజ్జంకి కనక చారి , మాజీ ఎంపీటీసీ బిక్షపతి మండల మహిళా అధ్యక్షురాలు లలిత,  మాజీ ఎంపిటిసి దాసరి వెంకటరమణ నక్క రమాదేవి, చుక్కపల్లి  బాలాజీ, సాయిబాబా , బెబ్బులి చిరంజీవి,కాకాని రాంబాబు,నాగ, అరుణ్ ప్రసాద్,పంగి సురేష్, నాగ్ రవి నాగ్ సురేష్, అశోక్,  ధారా నరసింహారావు, రెడ్డి పోగు రవి,  రమేష్, నాయకులు భూక్య కృష్ణ, , అజయ్,వేణు, రాజేష్, జానీ, మహేష్, బలరాం, ఆకాష్, మహేష్, రమేష్, సందీప్పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.