హోంగార్డ్ కుటుంబాన్ని పరామర్శించిన ట్రాఫిక్ ఎసిపి.

Published: Monday February 22, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, పిబ్రవరి21, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూన్న హోం గార్డ్ బి. శ్రీనివాస్ యొక్క కూతురు మనీషా  9వ తరగతి విద్యార్థి బెల్లంపల్లి లోని రెసిడెన్షియల్ హాస్టల్ లో చదువుతుండగా అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకుని ఆదివారం రామగుండం ట్రాఫిక్ ఎసిపి బాలరాజు మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  ప్రవీణ్ కుమార్ తో కలసి హోంగార్డ్ కుటుంబాన్ని పరామర్శించించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తరుపున హొంగార్డు కుటుంబానికి రూ.26,000/- ఆర్థిక సహాయం అందించారు. వీరి వెంట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మంచిర్యాల, బి.అనిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దపల్లి, వినోద్, శివకేశవులు సురేందర్, ట్రాఫిక్ ఎస్ఐ బి.శ్రీనివాస్, ఎన్. శ్రీనివాస్ ఏఎస్ఐ మరియు ఇతర సిబ్బంది ఉన్నారు.