ప్రతి ఒక్కరూ గాంధీ మార్గాన్ని అనుసరించాలి: ఎంపీపీ మెండెం లలిత

Published: Monday January 31, 2022
మధిర జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మండల ప్రజా పరిషత్ లో మండల అధ్యక్షురాలు మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ చూపిన శాంతి మార్గంలో నడవాలని మండల పరిషత్ అధ్యక్షురాలు మెండెం లలిత కోరారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గాంధీ మహాత్ముడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పంచుకుని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు సిబ్బంది టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మెండెం వెంకన్న పాల్గొన్నారు.