జువ్వాడి సోదరుల కారు బోల్తా - సురక్షితంగా బయటపడ్డ సోదరులు
Published: Wednesday February 17, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన): జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయులు జువ్వాడి నర్సింగరావు కృష్ణారావు కారు అదుపుతప్పి బోల్తా పడడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సంబంధించిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నర్సింగరావు అతని సోదరుడు కృష్ణారావు సురక్షితంగా బయటపడ్డారు. నర్సింగరావు కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్నారు.
Share this on your social network: