40వ సారి కరీంనగర్ లో రక్తదానం-గాలిపెల్లి కుమార్ ◆గాలిపెల్లి కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శ
Published: Wednesday August 24, 2022
కరీంనగర్, ఆగస్టు 23 (ప్రజాపాలన ప్రతినిధి): మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా మెగా డిజిటల్ టీం కరీంనగర్ ఇంచార్జ్ ఔట్ స్టాండింగ్ బ్లడ్ దోనర్ గాలిపెల్లి కుమార్ 40 వ సారి రక్త దానం చేసి తనపై ఉన్న అభిమానం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 30 మందికి పైగా చిరంజీవి అభిమానులు రక్త దానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో రకాలైన దానాలున్నప్పటికీ రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని, డబ్బుతో సంబంధం లేకుండా చేయగలిగే సేవా కార్యక్రమం రక్తదానమని అన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి.
Share this on your social network: