మధుర చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు కళ్లద్దాలు పంపిణీ

Published: Monday December 12, 2022
మేడిపల్లి, డిసెంబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి)
మధుర చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకుని, ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని చిల్కానగర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని  20 మంది కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళద్దాలు, మందులు అలాగే 200 మందికి కంటి అద్దాలను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మధుర చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కంటి ఆపరేషన్లు మరియు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం, పేద మహిళలకు ఉపాధి లక్ష్యంగా కుట్టు మిషన్లు , అల్లికలు ఎంబ్రాయిడరీ వర్క్ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని, రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉదృతంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో నిర్వహిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో
జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్, ఉప్పల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నరేష్, కరిపె మల్లికార్జున్, సురేందర్ రెడ్డి, శాంతి యాదవ్, బొట్టు వెంకట్, సుదర్శన్, నారా మహేష్, చర్చి కాలనీ రాజు తదితరులు పాల్గొన్నారు.