హరితహారం మొక్కను తొలగించిన వ్యక్తికి జరిమానా
Published: Tuesday August 23, 2022
కోరుట్ల, ఆగస్టు 22 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ కి సమీపంలో నాటిన హరితహారం మొక్కలలో ఒక మొక్కని పండరి అనే వ్యక్తి తొలగించినందుకు అతనికి కోరుట్ల మున్సిపల్ సిబ్బంది 5000 రూపాయల జరిమానా విధించారు. అనంతరం అతని తో ఐదు మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ హరితహారం లో నాటిన మొక్కలను ఎవరు తొలగించకూడదని, తొలగించిన వ్యక్తులకు జరిమానా విధిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Share this on your social network: