హరితహారం మొక్కను తొలగించిన వ్యక్తికి జరిమానా

Published: Tuesday August 23, 2022

కోరుట్ల, ఆగస్టు 22 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ కి సమీపంలో నాటిన హరితహారం మొక్కలలో ఒక మొక్కని పండరి అనే వ్యక్తి తొలగించినందుకు అతనికి కోరుట్ల మున్సిపల్ సిబ్బంది 5000 రూపాయల జరిమానా విధించారు. అనంతరం అతని తో ఐదు మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్  మాట్లాడుతూ హరితహారం లో నాటిన మొక్కలను ఎవరు తొలగించకూడదని, తొలగించిన వ్యక్తులకు జరిమానా విధిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.