ఇంజాపూర్ స్నేహపురి కాలనీలో సిసి రోడ్ పనులు పరిశీలించిన బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చ సోషల్ మీడ

Published: Friday August 05, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 4 ప్రజా పాలన ప్రతినిధి వారు మాట్లాడుతూ కాలనీలో సిసి రోడ్లు పనులు ప్రారంభించి నెలరోజులు గడచిన సీసీ రోడ్ పనులు పూర్తి చేయని  కాంట్రాక్టర్, రోడ్డు మొత్తం గుంతలు చేసి ఇప్పటివరకు కూడా సిసి రోడ్ పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ కాలనీవాసులనూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు,
ఈనెల 31 తారీకు వినాయక చవితి ఉంది కాలనీవాసులకు ఈ రోడ్డు చాలా ముఖ్యమైనది ఈ రోడ్డుకు ఎదురుగానే వినాయకుడి మండపం ఉంది కావున ఈ రోడ్డును వెంబడే నిర్మించకపోతే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది,
కాంట్రాక్టర్ కొంత పనిని ప్రారంభించి కాలనీలో వెహికల్స్ ఇక్కడ అక్కడ వెళ్లకుండా రోడ్డు కిరువైపులా ఘటర్స్ పెట్టడం జరిగింది కనీసం మెటల్ వేసిన తర్వాత రోడ్డు రోలర్లతో రోలింగ్ కూడా చేయకుండా అలాగే వదిలేయడం జరిగింది ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా కాలనీ వాసులను ఇబ్బందులు పాలు చేస్తారు.
స్థానిక కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి , తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతి గారు, ఏ ఈ గుణాకర్  ఈ విషయంపై తక్షణమే స్పందించి కాంట్రాక్టర్తో పనులు పూర్తి చేయించాలి లేనిచో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అని వారు తెలిపారు.