బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన బోనకల్ టిఆర్ఎస్ మండల కమిటీ

Published: Tuesday December 07, 2021
బోనకల్ డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి: నేడు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బోనకల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, మండల రైతు బంధు కన్వీనర్ వేమూరు ప్రసాద్, కార్మిక సంఘం అధ్యక్షుడు బంధం నాగేశ్వరావు, మధిర మార్కెట్ కమిటీ సభ్యులు కొనకంచి నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు మోర్ల మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనకయ్య, రైతు సంఘం అధ్యక్షుడు కాకాని శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు వెనిగళ్ళ మురళి, సురేష్, దారగాని నారాయణ, కొమ్మినేని సత్యనారాయణ అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించినారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.