మదనాంతపూర్ కు బస్సు సర్వీసు ప్రారంభం

Published: Tuesday November 08, 2022
వికారాబాద్ డిపో మేనేజర్ మహేష్ కుమార్
వికారాబాద్ బ్యూరో 7 నవంబర్ ప్రజా పాలన : మదనానంతపూర్ గ్రామానికి కొత్తగా టిఎస్ఆర్టిసి బస్సు సర్వీసును ప్రారంభించామని వికారాబాద్ డిపో మేనేజర్ మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ డిపో బస్సు ఉదయం 6 గంటల నుండి బయలుదేరిన బస్సు వయా ధారూర్ మీదుగా మధునంతపూర్ కు  ఉదయం ఏడు గంటలకు చేరుతుందన్నారు. 
మదనంతాపూర్ నుండి వికారాబాద్ కు 7:45 కు  వస్తుంది. మరల సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుండి మదనానంతపూర్ వెళ్తుందని డిపో మేనేజర్ మహేష్ కుమార్ తెలిపినారు. గతవారం జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, డిఎస్పీల ప్రత్యేక చొరవతో ఈ బస్సు నిలపవలసిందిగా డిపో మేనేజర్ కు తెలియజేశారు. డిపో మేనేజర్ వెంటనే స్పందించి ఈ యొక్క బస్సును సోమవారం నుండి ప్రారంభించడం జరిగిందని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు అందరూ కూడా ఆటోలలో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సురక్షితంగా వారి పనులు ముగించుకొని మరల ఆర్టిసి బస్సు ఎక్కి ఇంటికి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మలు ఎస్సై  మదన అనంతపూర్ సర్పంచ్ ఎంపీపీ , డిపో సూపర్వైజర్స్ పాల్గొన్నారు.