జిల్లా స్థాయి అవార్డును గెలిచిన సాతారం సర్పంచ్

Published: Monday May 17, 2021
సాతరం గ్రామ సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్
మల్లాపూర్, మే 15, ప్రజాపాలన ప్రతినిధి : సర్పంచుగా గ్రామంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు దగ్గరగా ఉంటూ అత్యవసరమైన ఉత్తమ సేవలను అందించినందుకు గాను హైదరాబాద్ కు చెందిన ప్రణవి ఫౌండేషన్, సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ ఇచ్చే జిల్లా స్థాయి ప్రశంస అవార్డ్ ను ఇస్తుంది. ఈ అవార్డును జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం చెందిన సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ కు లభించింది. సాతరం గ్రామంలో ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ గ్రామంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామ ప్రజలకు ధైర్యం కలిపిస్తూ, ఐసోలేషన్ కేంద్రం కూడా ఏర్పాటుచేసి, మననేస్తాం స్వచ్ఛంద సంస్థ ద్వారా చుట్టుప్రక్కల వారికి సహాయ కార్యాక్రమలు నిర్వహిస్తునందున ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ఏ,జైన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సుమలత రాజేష్ మాట్లాడుతూ ఈ అవార్డుకు సహకరించినా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, గ్రామప్రజలకు, అవార్డును ఎంపికచేసిన జైన్ కుమార్  అభినందనలు తెలిపారు