ఘనంగా సద్గురు సంత్ రవిదాస్ జయంతి
Published: Thursday February 17, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బిజెపి రంగారెడ్డి జిల్లా ఎస్సిమోర్చా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్ ఆద్వర్యంలో సద్గురు సంత్ రవి దాస్ గారి జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆనంతరం కార్మికులకు పండ్ల పంపిన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బిజెపి వనపర్తి ఇంచార్జి బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ రవిదాస్ 13వ శతాబ్దికి చెందిన ఆధ్యాత్మిక గురువు కులనిర్ములన గురించి పాటు పడ్డ గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ అధ్యక్షుడు తూళ్ళ నర్సింహ గౌడ్ ,జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తూళ్ళ వసంత్ పలుస శ్రవణ్ కుమార్ గౌడ్ మాధు శ్రీకాంత్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి,బీసీ మోర్చా అధ్యక్షుడు మోహన్ గౌడ్ మల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: